Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూ

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (10:15 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పన్నీర్ మద్దతిచ్చే మధుసూదన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 
 
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎక్కువగా పన్నీర్‌ వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జయలలిత మరణం వెనుక రహస్యాలున్నాయి, శశికళ బండారం బయట పెడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన పన్నీర్‌ సెల్వం ఆ రహస్యాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ 90 శాతం నిజాలు ఏంటో బయట పెట్టిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాల్సిందిగా స్టాలిన్‌ సవాలు విసిరారు.
 
అయితే స్టాలిన్ వ్యాఖ్యల పట్ల పన్నీర్ సెల్వం ఘాటుగా స్పందించారు. డీఎంకే ఓటమి భయంతో ఇలా మాట్లాడుతుందన్నారు. 2006వ సంవత్సరంలో తనను అమ్మకు శశికళ దూరం చేయాలని చూసిందని.. అందుకు సంబంధించినవే ఆ 90 శాతం నిజాలంటూ సెల్వం వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments