Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజారుద్దీన్ ఇంటికి కరెంట్, నీరు కట్ చేసిన అధికారులు!

Webdunia
ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (15:25 IST)
న్యూఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్ సింగ్, జితేంద్ర సింగ్, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ నివాసాలు ఉన్నాయి.
 
అధికారిక నివాసాలు ఖాళీ చేయాలని చాలా సార్లు నోటీసులు పంపించినా.. తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌డీఎంసీ అధికారి తెలిపారు. విద్యుత్, నీటి నిలిపివేత తర్వాత కొందరు ఖాళీ చేశారని ఐతే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు.  
 
కాగా సెప్టెంబర్ 4వ తేదీ లోపు ఇళ్లు ఖాళీ చేయాలని లోక సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానం చెప్పనివారి ఇళ్లకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలిపివేశారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments