Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవోకేను గురుదక్షిణగా ఇస్తే సంతోషిస్తా : జగద్గురు రాంభద్రాచార్య

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (14:17 IST)
తనను కలిసిన భారత ఆర్మీ చీఫ్ జనవర్ ఉపేంద్ర ద్వివేదీని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు రాంభద్రాచార్యునను ఓ కోరిక కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి భారతదేశంలో కలపాలని, దానిని తనకు గురుదక్షిణగా సమర్పించాలని భారత సైన్యాధిపతిని కోరారు. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
 
చిత్రకూట్‌లోని జగద్గురు ఆశ్రమానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెళ్లారు. ఆయనకు స్వామీజీ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. లంకకు వెళ్లే ముందు హనుమంతునికి "ఏ రామ్" మంత్ర దీక్షను ఇచ్చారో అదే దీక్షను జనరల్ ద్వివేదికి కూడా ఇచ్చినట్టు జగద్గురు రాంభద్రాచార్య తెలిపారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆధ్యాత్మిక అంశాలపై చర్చ జరిగింది. ఆశ్రమంలోని ఇతర సాధువులు, విద్యార్థులతో కూడా ఆర్మీ చీఫ్ పిచ్చాపాటిగా ముచ్చటించారు. 
 
ఈ భేటీ సందర్భంగా జగద్గురు రాంభద్రాచార్య మాట్లాడుతూ పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుని భారత్‌లో వినీలం చేయాలని, దాన్ని తనకు గురుదక్షిణగా ఇవ్వాలని కోరారు. హిందూ సంప్రదాయంలో గురువుకు శిష్యుడు సమర్పించే కానుక లేదా గౌరవాన్ని గురుదక్షిణ అంటారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments