Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను పెళ్లాడిన లేడీ డాన్... బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టమట...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (09:01 IST)
ఢిల్లీలో వ్యభిచార దందాను నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన లేడీ డాన్ సోనూ పంజాబన్ అలియాస్ గీతా అరోరా. ఈమె ఏకంగా నలుగురు గ్యాంగ్‌స్టర్లను పెళ్ళాడింది. ఆ నలుగురు చివరకు ఎన్‌కౌంటర్‌లో హతంకావడం ఆమె విధిరాత. అయితే, ఈ లేడీ డాన్ జీవితంలోకి నలుగురు గ్యాంగ్‌స్టర్‌లు ఏ విధంగా ప్రవేశించారో పరిశీలిద్దాం.
 
ఢిల్లీకి చెందిన సోనూ... మంచి అందగత్తె. తన అందంతో హై ప్రొఫైల్ వ్యాపారవేత్తలకు వలవేసి, వారిని వ్యభిచారానికి ప్రోత్సహించేది. అలా వ్యభిచారాన్ని తన ప్రధాన వృత్తిగా ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ గ్యాంగ్‌స్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అతను పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆ తర్వాత మరో గ్యాంగ్‌స్టర్.. అతనూ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఏకంగా నలుగురు గ్యాంగ్‌స్టర్‌లను ఆమె పెళ్లి చేసుకోగా వారంతా ఎన్‌కౌంటర్‍లోనే ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో కొన్నేళ్ళపాటు చీకటి రాజ్యంలో గడుపుతూ.. వ్యభిచార దందాను కొనసాగిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇదే కేసులో అరెస్టు కావడం, విడుదలకావడం పరిపాటిగా మారిపోయింది. ప్రధానంగా సినిమా, మోడలింగ్‌ రంగంలోకి రావాలని ఆశపడే యువతులను వలవేసి గీతా వ్యభిచారదందాలోకి దించేది. ఈ అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేసేందుకు హైప్రొఫైల్‌ వ్యాపారవేత్తలు సహా అనేక మంది ప్రముఖులు ఆమె కస్టమర్లుగా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
పైగా, ఈమెకు 'బాడ్‌ బాయ్స్' అంటే మహాయిష్టమట. కానీ తన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోయారని పోలీసులు చెప్పారు. మొదట గ్యాంగ్‌‌స్టర్‌ హేమను పంజాబన్ పెళ్లి చేసుకుంది. పోలీసుల ఎన్‌‌కౌంటర్‌‌లో హేమను మృతి చెందాక తన పేరులో సోనూ చేర్చుకుంది. ఆ తర్వాత మరో గ్యాంగ్‌‌స్టర్‌ విజయ్‌ సింగ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే 2003లో గర్హ్‌ ముక్తేశ్వర్‌ ప్రాంతంలో సింగ్‌ను ఉత్తరప్రదేశ్‌ ఎస్.టి.ఎఫ్. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 
 
ఆ పిమ్మట మరో బాయ్‌‌ఫ్రెండ్‌ దీపక్‌ కూడా అస్సోంలో పోలీసుల చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత దీపక్‌ తమ్ముడు హేమంత్‌ సోనూ పంజాబన్‌‌కు ఆసరాగా నిలిచాడు. కొద్ది రోజులకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఓ హైప్రొఫైల్‌ జంట హత్యల కేసులో హస్తమున్న హేమంత్‌‌ను 2006లో ఢిల్లీ-గురుగ్రామ్‌‌లో స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఎన్‌‌కౌంటర్‌ చేశారు. ప్రస్తుతం తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments