Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సోనియా గాంధీ అభ్యంతరకర ఫోటోపై పోలీస్ స్టేషన్లో ఘర్షణ: వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (11:45 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతరకర ఫోటోను పోస్ట్ చేయడంతో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో విషాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంలో 33 ఏళ్ళ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. విజయనగర్‌ ఫ్రెండ్స్‌ పేరిట రాజ్‌ తమ ప్రాంతంలోని వారితో కలిసేందుకు ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడు.
 
అయితే ప్రశాంత్‌ నాయక్‌ అనే వ్యక్తి ఆ గ్రూప్‌లో సోనియా గాంధీ పాత్రలు తోముతున్నట్టుగా ఉన్న ఓ వ్యంగ్య చిత్రాన్ని పోస్ట్‌ చేస్తూ ప్రధాని మోడీయే సోనియాకు ఆ పరిస్థితి రావడానికి కారణమనే రీతిలో కామెంట్‌ చేయడంతో అసలు వివాదం చెలరేగింది. దీనిపై ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలీస్‌ స్టేషన్‌కి రమ్మని పిలిచారు. 
 
పోలీస్ స్టేషన్లోనూ వారు పరస్పర దాడులకు దిగడం కారణంగా 33 ఏళ్ల వ్యక్తి కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమేష్‌ వర్మకూ తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments