Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఉద్యోగాలు హుష్‌కాకి.. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీనా? : మోడీపై సోనియా ధ్వజం

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2015 (15:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆదివారం స్వాభిమాన్ సభను నిర్వహించారు. మహాకూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సోనియాతో పాటు బీహార్ ముఖ్యంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్డీయే అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారని ఆమె ధ్వజమెత్తారు. 
 
యువతకు భరోసా లభించడంలేదని, వారిప్పుడు ఉపాధి కరవై రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 
 
బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కాదని, ప్రత్యేక హోదా కావలన్నారు. పైగా ఇటీవల ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కేవలం కంటి తుడుపు చర్యేనని ఆమె ఆరోపించారు. ఈ ప్యాకేజీపై స్పష్టత లేదని సోనియా గుర్తు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments