Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వీడితేనే ప్రాణాలతో ఉండగలరు... సోనియాకు వైద్యుల సలహా?!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (15:29 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైద్యులు గట్టి హెచ్చరిక చేశారు. తక్షణం ఢిల్లీని వీడాలని ఆమెకు సూచించారు. లేనిపక్షంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తారా స్థాయికి చేరుకుంది. నానాటికీ గాలిలో నాణ్యత నానాటికీ క్షీణించిపోతోంది. ఈ కాలుష్యం వల్ల ఆమెకు ఛాతి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అందుకే తక్షణం ఢిల్లీని వీడాలని వైద్యులు సలహా ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 
 
నిజానికి సోనియా గాంధీ కొంత కాలంగా ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. అలాగే, ఆమె కేన్సర్‌కు కూడా మందులు వాడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో గత జూలై నెల 30వ తేదీన గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబరు మాసంలో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమై కొన్ని రోజుల పాటు ఆమె విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇతర ప్రాంతానికి మకాం మార్చాలని సోనియాకు వైద్యులు సూచించారు. ఈ సూచనలతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియాతో పాటు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments