Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (17:19 IST)
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (78) అనారోగ్యంబారినపడ్డారు. దీంతో ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ఆదివారం రాత్రి సోనియా గాంధీకి నలతగా ఉండటంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది వెంటనే స్పందించి హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గత కొంతకాలంగా ఆమె ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఆమెను ఆస్పత్రిలో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చేర్పించినట్టు గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
 
సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల బృందం ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది అని డాక్టర్ అజయ్ స్వరూప్ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments