Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్నాథ్‌లో మంచు తఫాను : బాధితుల్లో మాజీ సీఎం, ఓ ఎంపీ

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌

Webdunia
బుధవారం, 9 మే 2018 (11:34 IST)
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేదార్నాథ్‌కు వచ్చిన యాత్రికులు, భక్తులు మంచు తుఫానులో చిక్కుకుని పోయారు. వీరిలో మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ ప్రదీప్‌లు కూడా ఉన్నారు.
 
దీనిపై రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గౌరికుంద్‌కు వెళ్లే దాదాపు 4,200 మంది యాత్రికులు మంచు తుఫాను కారణంగా కేదార్నాథ్‌లో చిక్కుకుపోయారని, వీరిలో 400 మందికి పైగా వృద్ధులు ఉన్నారని తెలిపారు. 
 
అయితే, వీరందరినీ సురక్షితంగా రక్షించేందుకు స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ జవాన్లు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఐదు ఇంచుల మేర మంచు కురుస్తుండటంతో హెలికాప్టర్ సేవలు, యాత్రికుల కదలికలు నిలిచిపోయాయని తెలిపారు. 

అలాగే, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న మంచు తుఫానులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఛైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మితో పాటు పలువురు జెడ్పీటీసీలు చిక్కుకున్నారు. ఉపాధి హామి పనుల అమలు తీరును పరిశీలించేందుకు వీరంతా గత వారంలో ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. చార్‌ధామ్ సమీపంలోని సీతాపురి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న మంచు తుఫానులో వీరంతా చిక్కుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments