Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 5 జులై 2024 (19:10 IST)
సాధారణంగా ఓ పాము కాటేస్తే.. విషపూరితమైనది అయితే.. మనిషి నిమిషాల్లో మరణిస్తాడు. కానీ మనిషి కాటేస్తే పాము చనిపోయిన వింత ఘటన చోటుచేసుకుంది. పాము తనను కాటేసిందన్న కోపంతో తిరిగి దాన్ని కరవడంతో ఆ పాము చనిపోయింది. ఈ ఘటన బీహార్ లోని నవాడాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రైల్వే కార్మికుడు సంతోష్ లోహార్.. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో అతడ్ని పాము కాటేసింది. దీంతో ఏదో కుట్టిందని లేచి చూడగా.. పాము కనిపించింది. తనను పాము కాటేసిందన్న కోపంతో.. వెంటనే పామును పట్టుకుని, రెండు సార్లు కొరికాడు. దీంతో పాము మరణించింది. 
 
అతడు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించారు. పాము తనను కరిచినా, తిరిగి అతడు పామును కొరికినా.. విషం అతడ్ని ఏం చేయలేకపోయింది. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments