Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ప్రాణాలు నవజాత శిశువులు

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (09:36 IST)
ఢిల్లీలోని ఓ చిన్నారుల ఆస్పత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వివేక్ నగర్‌లోని న్యూబార్న్ బేబీ కేర్‌ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్టు అగ్నిమాపకదళ సిబ్బంది వెల్లడించారు. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా మిగతా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఈస్ట్ ఢిల్లీ ఎడ్వాన్స్ ఎన్.ఐ.సి.యు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. 
 
శనివారం రాత్రి 11.32 గంటలకు ఫైర్ కంట్రోల్ రూంకు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసిపోతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పివేశాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నగరంలోని గేమ్ జోన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments