Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో కల్తీ మద్యానికి ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (14:15 IST)
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంపూర్ణ మద్య నిషేధంపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు, రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. 
 
తాజాగా బీహార్‌లో కల్తీ మద్యం సేవించి ఆరుగురు మద్యంబాబులు ప్రాణాలు కోల్పోయారు. బక్సర్ జిల్లాలోని అమ్సారీలో బుధవారం రాత్రి పలువురు కల్తీ మద్యం సేవించారు. దీంతో వారిలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ జిల్లా నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో ఐదుగురు మరణించి వారం రోజుల తిరగకముందే బక్సర్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments