Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

ఠాగూర్
ఆదివారం, 27 జులై 2025 (14:04 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్‌లో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హాటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరిపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఆరుగురు భక్తులు చనిపోయిన విషయాన్ని గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండ్ ధృవీకరించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఆలయం వద్దకు బయలుదేరారని, ఘటనా స్థలాన్ని పరిశీలించాక ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments