Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను లేపుకెళ్లాడనీ... కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు

Webdunia
గురువారం, 16 మే 2019 (12:48 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు చేసిన వెధవపనికి అతని కుటుంబ సభ్యులందరినీ అనేక మంది కలిసి చెట్టుకు కట్టేసి చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గ్రామ శివార్లలో నివశిస్తున్నాడు. 
 
ఈ మహిళకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆమెను వదిలి ఉండలేని ఆ యువకుడు ఆమెను లేపుకెళ్లాడు. విషయం తెలుసుకున్న ముఖేష్.. భార్యకు, ఆ యువకుడుతో ఫోనులో మాట్లాడి... సమస్యను చర్చించి పరిష్కరించుకుందామని చెప్పి గ్రామానికి రప్పించారు. 
 
ఆపై ఆ యువకుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను పట్టుకుని తన స్నేహితుల సాయంతో చెట్టుకు కట్టేసి చితకబాదాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఘటనా స్థలికి చేరుకుని, గాయాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులపై పోస్కో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసి కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments