Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం : కోడలు ఉరేసుకుంటే.. వీడియో తీసిన అత్తామామలు!

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (13:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడలు ఉరేసుకుంటే అత్తామామలు వీడియో వీడియో తీశారు. ఈ అత్మహత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు స్మార్ట్ ఫోనులో వీడియో తీసినట్టు చెబుతున్నారు. అనంత‌రం ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేశారు.
 
క‌ళ్ల ముందే కోడ‌లు చ‌నిపోతున్నా క‌నిక‌రం లేకుండా వారు పాల్ప‌డ్డ చ‌ర్య ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ డాటియానా గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది. ఆ స‌మ‌యంలో కోమల్ తల్లిదండ్రులు క‌ట్నంగా ఐదు లక్షల రూపాయలను న‌గ‌దు, ఒక బైక్‌ని ఇచ్చారు.
 
అయిన‌ప్ప‌టికీ ఇంకా క‌ట్నం కావాల‌ని ఆరు నెలలుగా ఆశిష్ త‌ల్లిదండ్రులు కోడ‌లిని వేధిస్తున్నారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురాక‌పోతే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆశిష్‌తో క‌లిసి ఆమెను వేధింపుల‌కు గురి చేస్తున్నారు. దీంతో కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
గ్రామ‌ పెద్దలు ఆమెకు నచ్చజెప్పడంతో తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. ఆమెను అత్తమామలు మళ్లీ  వేధించడంతో త‌ట్టుకోలేక‌పోయిన ఆమె గ‌దిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆమెను ఆప‌కుండా, ఆ దృశ్యాల‌ను కిటికీలో నుంచి చిత్రీకరించిన అత్తామామ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments