Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రిస్తున్న వ్యక్తిపై నిప్పంటించిన యువకులు.. వీడియో చూడండి

సోషల్ మీడియా ప్రభావంతో యువత రెచ్చిపోతోంది. చిన్న చిన్న ఈవెంట్లు జరిగినా ఫోటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే చెన్నైలో యువకులు ఓవరాక్షన్ చేశారు. తాము చేసిన దుశ్చర్యన

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (12:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో యువత రెచ్చిపోతోంది. చిన్న చిన్న ఈవెంట్లు జరిగినా ఫోటోలు, వీడియోలు తీసి అందులో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే చెన్నైలో యువకులు ఓవరాక్షన్ చేశారు. తాము చేసిన దుశ్చర్యను ఏదో ఘనకార్యం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి రాక్షసానందం పొందారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులకు చిక్కారు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నైలో రోడ్డు పక్కన నిద్రపోతోన్న ఓ వ్యక్తికి కొంత‌మంది పోకిరీలు నిప్పంటించి, సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆనందప‌డ్డారు. అనంత‌రం ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తామేదో ఘ‌న‌కార్యం చేశామన్నట్లు ప్ర‌చారం చేసుకున్నారు. ఓ పేద వ్యక్తి మద్యం సేవించి రోడ్డు మీద నిద్రిస్తుండగా.. అతని వద్దకు వెళ్లిన యువకులు నిప్పింటించారు. బాధితుడు నిప్పు నుంచి దూరం జరిగి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 
 
కానీ ఆ యువకులంతా వచ్చి అతడిని కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ కనిపించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. పోలీసులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments