Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీని నమ్ముకుని బిచ్చగాడుగా మారాడు... ఎక్కడ?

వారం రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన సోనియా గాంధీ కమెండో రాకేశ్ కుమార్ ఢిల్లీ పోలీసులు కనుగొని, అతడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అతడు బిచ్చం ఎత్తుకుంటూ వీధుల్లో తిరుగుతూ కనిపించడమే. ఇంతకీ అసలు అతడెందుకు అలా మారాల్సి వచ్చిందో తెలుసుకుంట

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (13:02 IST)
వారం రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన సోనియా గాంధీ కమెండో రాకేశ్ కుమార్ ఢిల్లీ పోలీసులు కనుగొని, అతడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అతడు బిచ్చం ఎత్తుకుంటూ వీధుల్లో తిరుగుతూ కనిపించడమే. ఇంతకీ అసలు అతడెందుకు అలా మారాల్సి వచ్చిందో తెలుసుకుంటే ఈ విషయం బయటపడింది. 
 
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజి) కమెండో రాకేశ్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం టెన్ జన్ పథ్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి బ్యాంకులో 4 లక్షల రూపాయల అప్పు ఉంది. ఆగస్టు 31 నాటికి తన వద్ద వున్న మొత్తం రూ.40 వేలు బ్యాంకు ఇన్‌స్టాల్‌మెంట్‌కు కట్టేయడంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇక ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్లాలనుకుని ఇంటికి వెళ్లకుండా సంపన్నులు నివాసం వుండే లూటియన్స్ ప్రాంతంలోని పార్కులలో తిరుగుతూ కాలం వెళ్లబుచ్చాడు. 
 
ఈ క్రమంలో అతడికి తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక బిచ్చగాడిలా మారిపోయి భిక్షమెత్తుకోవడం ప్రారంభించాడు. ఈ స్థితిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడే సోనియా గాంధీ సెక్యూరిటీ కమెండోగా తేలింది. నిజాయితీతో పనిచేసే రాకేశ్ ఇలా బిచ్చగాడిగా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments