Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలకు రూ.15 వేలు సంపాదించుకునే దినసరి కూలీకి రూ.14 కోట్ల పన్ను నోటీసు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:10 IST)
అతనో రోజువారీ కూలీ. నెలకు రూ.15 వేలు కష్టపడి సంపాదించుకుంటున్నాడు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టిలో అతనో బడా వ్యాపారి.  అందుకే రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఐటీ శాఖ తాజాగా నోటీసు పంపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన రోహాస్త్‌కు చెందిన మనోజ్ యాదవ్ అనే వ్యక్తి రోజుకూలీ. నెలకు రూ.12 నుంచి రూ.15 వేలు సంపాదిస్తాడు. అయితే, ఈయనకు తాజాగా ఐటీ శాఖ నుంచి ఓ నోటీసు వచ్చింది. దాన్ని చూసిన ఆయన విస్తుపోయాడు. నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి రూ.14 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
 
తనకు అందిన నోటీసులను చూసిన షాక్‌కు గురై కంగారుపడిపోయిన ఆయన.. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తాను ఒక దినసరి కూలీనని చెప్పారు. బీహార్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లినపుడు అక్కడి వ్యాపారులు తమ పాన్, ఆధార్ కార్డులు తీసుకుంటారని, ఈ క్రమంలో ఆ వివరాలు ఎక్కడైనా దుర్వినియోగమై ఉండటంతో ఇలాంటి నోటీసులు వచ్చి పంపించివుంటారని వాపోతున్నాడు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments