Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట బెంగళూరులో మహిళలు కనపించకూడదు: కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన గుర్తుండే వుంటుంది. ఇలాంటి ఘటనలు ఐటీ రాజధాని అయిన బెంగళూరులో సర్వసాధారణమైనాయి. దీంతో మహిళలకు భద్రత కల్పించే వి

Webdunia
శనివారం, 18 నవంబరు 2017 (10:34 IST)
కొత్త సంవత్సరం సందర్భంగా రోడ్డుపై వెళ్తున్న యువతిపై ఇద్దరు యువకుడు లైంగికంగా వేధించిన ఘటన గుర్తుండే వుంటుంది. ఇలాంటి ఘటనలు ఐటీ రాజధాని అయిన బెంగళూరులో సర్వసాధారణమైనాయి. దీంతో మహిళలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని.. విపక్షాలతో పాటు మహిళా సంఘాలు ఫైర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటని కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
బెంగళూరులో శాసనమండలిలో 'మహిళా భద్రత'పై జరిగిన చర్చలో రామలింగారెడ్డి మాట్లాడుతూ, అమ్మాయిలకు రాత్రిపూట రోడ్లపై పని ఉండదు కనుక, ఇకపై రాత్రివేళ బెంగళూరు రోడ్లమీద వాళ్లు కనిపించకూడదన్నారు. ఆఫీసులకు వెళ్ళే మహిళలు ఇకపై తన బంధువులను, కుటుంబీకులను తోడుగా తీసుకెళ్లాలని రామలింగా రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. 
 
అంతటితో ఆగకుండా బెంగళూరులో మొత్తం 1.2 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ భద్రత కల్పించడం తన వల్ల కాదని కూడా మంత్రి వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రామలింగారెడ్డి వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. చేతకానప్పుడు హోం మంత్రి బాధ్యతల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం