మొన్న బీహార్.. నేడు జార్ఖండ్.. విద్యార్థులంతా ఒకేచోట కూర్చొన్నారు.. తాపీగా పరీక్ష రాశారు!
మొన్నటికిమొన్న బీహార్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు ఇదేతరహా మాస్ కాపీయింగ్ ఘటన ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూ
మొన్నటికిమొన్న బీహార్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇపుడు ఇదేతరహా మాస్ కాపీయింగ్ ఘటన ఒకటి జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చొన్నారు. ఈ దృశ్యం డుంకాలో ఏర్పాటు చేసిన ఓ పరీక్షా కేంద్రంలో కనిపించింది.
దీనిపై కళాశాల ప్రొఫెసర్ మనోరంజన్ స్పందిస్తూ... విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడిన విషయాన్ని తాను చూడలేదన్నారు. సాధారణంగా ఒక బెంచీలో ఇద్దరిని కూర్బోబెడతామనీ, కానీ స్థలం తక్కువగా ఉండటంతో నాలుగురైదుగురిని ఒకచోట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్టు ఆయన చెప్పారు.