Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మహా" ప్రతిష్టంభన : రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం అడుగులు

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (13:29 IST)
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నెల పదో తేదీలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. అంటే పదోతేదీలోపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సివుంది. లేనిపక్షంలో రాష్ట్రపతిపాలన విధించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో సోమవారం మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అయితే, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించేలా నిధులు ఇవ్వాలని కోరడానికే అమిత్ షాను కలిసినట్లు బీజేపీ నేతలు అంటున్నారు.
 
మరోవైపు, సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా సమావేశంకానున్నారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 56 సీట్లు గెలుచుకున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. 
 
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని 50-50 ఫార్ములా ప్రకారం పంచుకోవాలంటూ బీజేపీ ముందు శివసేన డిమాండ్ పెట్టిన విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments