Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. సీఎం షిండేదే నిజమైన శివసేన

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:22 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. నిజమైన శివసేన పార్టీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే అని శుక్రవారం స్పష్టం చేసింది. పైపెచ్చు.. శివసేన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు, బాణం గుర్తును సీఎం షిండేకే కేటాయించింది. 
 
శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక అసలైన శివసేన పార్టీ తమదే అంటూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేంత వరకు ఇరు వర్గాలకు వేర్వేరు గుర్తులు కేటాయించింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిజమైన శివనసేన పార్టీ సీఎం షిండేదే అని, ఆ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు బాణం గుర్తును కూడా ఆయనకే చెల్లుతుందని వెల్లడించింది. దీనిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయం అంటూ ప్రకటించారు. 
 
మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఈసీ నిర్ణయాన్ని తాము ముందుగానే ఊహించినదని చెప్పారు. ఈ విషయంలో తాము బాధపడటం లేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments