Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. సీఎం షిండేదే నిజమైన శివసేన

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:22 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. నిజమైన శివసేన పార్టీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే అని శుక్రవారం స్పష్టం చేసింది. పైపెచ్చు.. శివసేన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు, బాణం గుర్తును సీఎం షిండేకే కేటాయించింది. 
 
శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక అసలైన శివసేన పార్టీ తమదే అంటూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేంత వరకు ఇరు వర్గాలకు వేర్వేరు గుర్తులు కేటాయించింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిజమైన శివనసేన పార్టీ సీఎం షిండేదే అని, ఆ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు బాణం గుర్తును కూడా ఆయనకే చెల్లుతుందని వెల్లడించింది. దీనిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయం అంటూ ప్రకటించారు. 
 
మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఈసీ నిర్ణయాన్ని తాము ముందుగానే ఊహించినదని చెప్పారు. ఈ విషయంలో తాము బాధపడటం లేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments