Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో విమానాలు ఎలా ఎగురుతాయో... దిగుతాయో మేం చూస్తాం : శివసేన ఎంపీల దాదాగిరి

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి ప్రదర్శించారు. నిండు సభలోనే కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోకగజపతి రాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ప

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (13:56 IST)
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి ప్రదర్శించారు. నిండు సభలోనే కేంద్ర పౌరవిమానయానశాఖమంత్రి అశోకగజపతి రాజుకు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుంటే ముంబై ఎయిర్‌పోర్టులో విమానాలు ఎలా ఎగురుతాయో.. దిగుతాయో తాము చూస్తామని హెచ్చరించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రవీంద్ర గైక్వాడ్ అంశం గురువారం చర్చకు వచ్చింది. ఆ సమయంలో శివసేన ఎంపీలతో కలిసి ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి అనంత్ గీతె కేంద్ర పౌరవిమానాయాన శాఖామంత్రి అశోకగజపతి రాజుపై దాడికి యత్నించారు. ఈ దాడిని పలువురు కేంద్ర మంత్రులు అడ్డుకున్నారు. 
 
అంతటితో ఆగని శివసేన ఎంపీలు... స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముంబై విమానాశ్రయంలో విమానాలు ఎలా దిగుతాయో.. ఎగురుతాయో తామూ చూస్తామని స్పీకర్ సమక్షంలోనే హెచ్చరించడం గమనార్హం. అంటే లోక్‌సభ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరికి పాల్పడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments