Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హింసను ప్రేరేపించింది బీజేపీనే : శివసేన

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (18:19 IST)
శాంతియుతంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ సర్కారేనని శివసేన ఆరోపించింది. ఢిల్లీలో హింస జరగడానికి బీజేపీనే ప్రధాన కారణమని పేర్కొంది. 
 
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చెలరేగిన హింస సమర్ధనీయం కాదని, దీనికి కేవలం రైతులనే నిందించడం తగదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. 
 
నిజానికి గత రెండు నెలలుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన శాంతియుతంగా సాగుతోందని, రైతులు ఎన్నడూ సంయమనం కోల్పోలేదని గుర్తు చేసింది.
 
కానీ, వారు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ భగ్నం చేసేందుకు రైతులను రెచ్చగొట్టి హింసకు మళ్లిస్తే వారి ఆందోళనను నీరుగార్చవచ్చని కేంద్ర ప్రభుత్వం కోరుకుందని పేర్కొంది. చేతిలో కర్రలతో కనిపించిన రైతులను జాతి విద్రోహులుగా పిలుస్తున్నారని.. కాల్పులు జరపండి.. హతమార్చండి అని పిలుపుఇచ్చిన వారంతా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఇంకా మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించింది. 
 
ఖలిస్తానీలనే ముద్రవేసినా రైతులు శాంతంగానే ఉన్నారని శివసేన పత్రిక పేర్కొంది. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక నిరసనలకు నేతృత్వం వహంచిన దీప్‌ సిధు పంజాబ్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు సన్నిహితుడని ఆరోపించింది. ఈయనకు బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments