Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం.. రాముడు పుట్టిన దేశంలో....?

Webdunia
బుధవారం, 1 మే 2019 (12:45 IST)
మహారాష్ట్రలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన పార్టీ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈస్టర్ డే వరుస పేలుళ్ళ తర్వాత శ్రీలంక ప్రభుత్వం బుర్ఖ ధారణపై నిషేధం విధించింది. దీన్ని ప్రస్తావించిన శివసేన.. భారత్‌లోనూ బుర్ఖా ధారణపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. 
 
దేశంలో ట్రిపుల్ తలాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగానే బుర్ఖాలను ధరించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా, రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం విధించగా, శ్రీరాముడు పుట్టిన దేశంలో వీటిపై నిషేధం విధిస్తే ఏంటటా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. 
 
ఈస్టర్ డే రోజున జరిగిన వరుస పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం బుర్ఖాలను, స్కార్ఫ్‌లను ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని శివసేన తన పార్టీ పత్రిక సామ్నాలో ప్రధానంగా ప్రస్తావించింది. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరింది. ముఖాలను కప్పి ఉంచే వస్త్రాలు, బుర్ఖాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగానే ధైర్యంగా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన కోరింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments