Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలను దూరం పెట్టి.. చైనాను తరిమికొడదాం... శివసేన పిలుపు

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (10:20 IST)
సరిహద్దుల్లో చైనా బలగాల హద్దుమీరి చర్యలపై శివసేన స్పందించింది. ఇపుడు రాజకీయాలను పక్కనబెట్టి... చైనా బలగాలను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. 
 
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద చైనా సైన్యం పాల్పడుతున్న దుందుడుకు చర్యలపై శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. డ్రాగన్‌ దేశాన్ని ఎదుర్కొనే విషయంపై రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. 
 
ముఖ్యంగా, లడఖ్ ప్రాంతంలో చైనా నిర్మాణాలు చేపట్టిందని, అరుణాచల్, సిక్కిం సరిహద్దుల నుంచి చైనా సైనికులు ప్రవేశిస్తున్నారని పేర్కొంది. దేశంలోని రాజకీయ విరోధులు సైతం ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందని శివసేన కోరింది. డ్రాగన్ దేశంతో పోరాటం చేయాలని, అన్ని పార్టీల నేతలు దీనిపై మాట్లాడాలని తెలిపింది.
 
సరిహద్దులో ఉద్రిక్తతలపై చైనా మాటలు ఒకలా ఉన్నాయని, చేతలు మరోలా ఉన్నాయని, సరిహద్దుల వద్ద యుద్ధ ట్యాంకులను మోహరించిందని తెలిపింది.  యుద్ధం చేయడానికి సిద్ధంగా లేని చైనా ఆ వాతావరణాన్ని మాత్రం సృష్టించి, ఇండియాను సమస్యల్లోకి నెట్టాలని యత్నిస్తోందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments