Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సమయంలో కొత్త మహాత్ముడు వచ్చాడు.. సోనూపై వెటకారం

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (18:09 IST)
నటుడు సోనూసూద్‌పై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాసి ఎడిటోరియల్‌లో సోనూ సూద్‌ను 'మహాత్ముడు' అంటూ వెటకారం చేశారు. 'కరోనా వైరస్ సమయంలో ఓ కొత్త మహాత్ముడు వచ్చాడని ఎద్దేవా చేసింది.

లక్షలాది మంది వలస కూలీలను సొంతూళ్లకు చేర్చాడు మహాత్మా సూద్ అంటూ గవర్నర్ కోషియారి కూడా ప్రశంసించారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల విషయంలో ఏమీ చేయలేకపోయాయి. 
 
సోనూ సూద్ ఒక్కడే వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపాడని చెప్పడానికా? అసలు సోనూ సూద్‌కి బస్సులు ఎక్కడి నుంచి లభించాయి? రాష్ట్రాలు వలస కూలీలను రావొద్దని చెబుతుంటే, వాళ్లంతా ఎక్కడికి వెళ్లినట్టు?' అని సామ్నా పత్రికలో విమర్శించారు.

కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిసిన సోనూ సూద్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని, ఆయన 'ముంబై సెలబ్రిటీ మేనేజర్‌'గా మారిపోతారని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్రలో చిక్కుకుపోయిన చాలామంది వలస కూలీలను సోనూసూద్ సొంత రాష్ట్రాలకు పంపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments