Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ప్రజలంతా ఒక్కటే... షియా, సున్నీ వక్ఫ్ బోర్డులు రద్దు : సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (10:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
 
షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ, సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ మంత్రిగా వ్యవహరించిన అజామ్ ఖాన్‌ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు పాల్పడిన అవకతవకలపై వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. 
 
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సున్నీ, షియా వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటూ వక్ఫ్ మంత్రి మొషిన్ రాజాను ఆదేశించారు. చట్టపరమైన అన్ని విషయాలు పరిశీలించిన అనంతరం సున్నీ, షియాల వక్ఫ్ బోర్డును రద్దు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు రద్దు, ఇతర విషయాలపై న్యాయ, చట్టపరమైన అంశాలపై అధ్యయనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం