హై ప్రొఫైల్ లేడీ ఇంద్రాణి ముఖర్జీయా కుమార్తె షీనా బోరా హత్య వ్యవహారం రకరకాల ట్విస్టులతో ముందుకెళుతోంది. ఆమె హత్య ఎలా జరిగిందన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. రాయ్ గఢ్ జిల్లా సమీపంలోని అడవిలో షీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇపుడు మళ్లీ ఆ మృతదేహం తాలూకు పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు.
మరోవైపు కేసులో కీలకంగా ఉన్న ఇంద్రాణి కుమారుడు మిఖాయిల్ బోరాను బాంద్రా పోలీసు స్టేషను నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. అతడిపై హత్యా యత్నం జరిగే అవకాశం ఉన్నదని అనుమాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఇంకోవైపు కేసును ఛేదించేందుకుగాను పీటర్ను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా అతడికి కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టనున్నారు.