Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్నం ఇవ్వలేదని.. భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేసిన భర్త.. ఆ తర్వాత?

వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావే

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:28 IST)
వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావేద్, ఫసీనా దంపతులు బెంగళూరులో నివసిస్తున్నారు.

ఫసీనా వద్ద వరుడి తరపు వారు పెళ్లి సమయంలో ఒకటిన్నర లక్ష రూపాయల నగదు, బంగారం అడిగారు. ఫసీనా తల్లిదండ్రులు అడిగినంత ఇవ్వలేకపోయారు. దీంతో అనేక సార్లు వరకట్నం తేవాల్సిందిగా ఫసీనాను జావేద్ వేధించాడు.
 
ఈ నేపథ్యంలో ఫసీనా భోజనం చేస్తుండగా.. గ్లాసులో కొన్ని నీళ్ళివ్వాల్సిందిగా భర్తను కోరింది. భర్త కూడా నీళ్లు తెచ్చాడు. భార్యకిచ్చాడు. అయితే ఆ నీటిలో యాసిడ్ కలిపాడు. దీన్ని తాగిన ఫసీనా రక్తంతో కూడిన వాంతులు చేసింది. ఆపై ఫసీనాను ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించారు. 
 
తాగిన నీటిలో యాసిడ్ కలపడంతో ఆమె రక్తపు వాంతులు చేసిందని వైద్యులు నిర్ధారించారు. యాసిడ్ తాగడంతో ఆమె అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments