Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద మృతి కేసులో శశిథరూర్‌కు హైకోర్టు నోటీసులు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (14:12 IST)
తన భార్య సునంద మృతి కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునంద పురష్కర్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశిథరూర్ ప్రేరేపించారనే అభియాగాలు ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆయన ప్రధాన నిందితుడిగా పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. దీంతో శశిథరూర్ ఢిల్లీలోని పాటియాలా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన కోర్టు 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
 
అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు శశిథరూర్‌కు నోటీసులు జారీచేస్తూ ఈ కేసు తదుపరి విచారణను వచ్చే యేడాది ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments