Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి రామమందిరం... ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లండి.. సుప్రీంకోర్టు రూలింగ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరిందో లేదో... ఇటు రామమందిర అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక రూలింగ్ ఇచ్చింది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (11:30 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరిందో లేదో... ఇటు రామమందిర అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక రూలింగ్ ఇచ్చింది. 
 
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే అంశంపై ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకోవాలని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చింది. ముస్లిం, హిందూ మతపెద్దలు ఏ నిర్ణయంతో వచ్చినా, మరో విచారణ లేకుండా కేసును మూసివేసి, వారి నిర్ణయాన్నే అమలు చేస్తామని ప్రకటించింది. 
 
ఈ విషయంలో అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని మాత్రమే తెలిపింది. అదేసమయంలో ఈ కేసును ఇంకా కొనసాగించడం ఇష్టం లేదని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ, ఇకపై ఈ కేసును ఇకపై దీర్ఘకాలం పాటు వాయిదాలు వేయలేమని పేర్కొంది.
 
ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 325 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరుడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments