Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:51 IST)
విద్య నేర్పించాల్సిన గురువే మృగంలా మారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి పదేళ్ల కారాశిక్ష విధించింది. గుజరాత్‌లోని దియోదర్ ప్రాంతంలో చన్ బు భగోరా అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
 
2017వ సంవత్సరంలో పాఠశాల ముగిసిన తర్వాత అందులో చదివే ఒక బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
 
దీనిపై విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376 క్రింద, పోస్కో చట్టం క్రింద కేసులు పెట్టి ఆ వ్యక్తిని రిమాండుకు పంపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ వ్యక్తికి 11 వేల రూపాయల జరిమానాతో పాటుగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా సమాజం తలదించుకునే పని చేసావంటూ నిందితుడిపై మండిపడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments