Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ బ్యాంకుకే కన్నం వేశాడు...

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (10:32 IST)
కస్టమర్ల డబ్బుకు కాపలా ఉండాల్సిన మేనేజర్ ఒకరు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశాడు. నెలకు 50 వేల రూపాయల విలువ చేసే బంగారు నాణేలను దొంగిలిస్తూ వచ్చాడు. ఇలా 17 నెలల పాటు దొంగతనం చేశాడు. చివరకు బ్యాంకు ఆడిటింగ్‌లో అతని బండారం బయటపడింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం అంగీకరించడంతో అరెస్టు చేసి కటకటాలవెనక్కి పంపించారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఈ బ్యాంకు చోరీ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ రాష్ట్ర రాజధాని కోల్‌కతాకు 82 కిలోమీటర్ల దూరంలోని మెమారి అనే ప్రాంతలో ఎస్.బి.ఐ శాఖ ఉంది. ఈ శాఖ మేనేజరుగా తారక్ జైశ్వాల్ పని చేస్తున్నారు. ఈయన ఈ శాఖలో 17 నెలలుగా పని చేస్తూ, 17 నెలల నుంచి ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది రోజుకు కొన్ని నాణేలను దొంగతనం చేయడం. అంటే నెలకు రూ.50 వేల విలువైన కాయిన్స్‌ను చోరీ చేస్తూ వచ్చాడు. 
 
ఈ విషయం బ్యాంకు ఆడిటింగ్‌లో బట్టబయలైంది. నవంబర్ 27వ తేదీ నుంచి ఈ ఆడిట్ మొదలవగా తారక్ బండారం బయటపడింది. శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా.. తాను దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
 
లాటరీలకు అలవాటు పడిన తారక్... వాటిని కొనుగోలు చేయడానికి ఈ నాణేలను దొంగతనం చేయడం మొదలుపెట్టినట్టు వెల్లడించాడు. అలా రూ.84 లక్షల విలువ చేసే నాణేలను దొంగిలించినట్టు చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments