ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీతో పాటు తనకు ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మనం నమ్మిన పన్నీర్ సెల్వమే కారణమని రిసార్టులో ఉన్న తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వద్ద శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీతో పాటు తనకు ఈ పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మనం నమ్మిన పన్నీర్ సెల్వమే కారణమని రిసార్టులో ఉన్న తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వద్ద శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే.
ఈ తీర్పు వెలువడిన తర్వాత ఎమ్మెల్యేలతో శశికళ మాట్లాడుతూ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమన్నారు. మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని ఆవేదన చెందారు. మన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అనంతరం జయలలిత సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దామని ఆమె వ్యాఖ్యానించారు.
పార్టీ నేతలంతా తనకు ఓ కుటుంబంలా అండగా ఉంటే తాను అన్నిటినీ సాధిస్తానని శశికళ అన్నారు. అమ్మ జయలలిత ఆశీర్వాదాలు తనకు ఉన్నాయని, 129 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని, ఈ విషయంలో విజయం సాధించాక ఆ విజయాన్ని జయలలితకు అంకితమిద్దామన్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న కుట్రలను గెలిపించకూడదని ఆమె ఎమ్మెల్యేలను ప్రాధేయపడ్డారు.