Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశా. ఇదొక లెక్కా అన్న శశికళ

జయలలితతో తన 30 ఏళ్ల అనుబంధంలో వెయ్యిమంది పన్నీర్ సెల్వంలను చూశా. ఈ సంక్షోభం నాకు ఓ లెక్కా అంటూ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, ప

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (02:19 IST)
జయలలితతో తన 30 ఏళ్ల అనుబంధంలో వెయ్యిమంది పన్నీర్ సెల్వంలను చూశా. ఈ సంక్షోభం నాకు ఓ లెక్కా అంటూ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్‌ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు.
 
తమిళనాడులో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా  వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్‌ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్‌ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
 
మరోవైపు ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్‌ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా మంగళవారం ఏం జరగబోతోందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతోపాటు పలువురు ఫైల్‌ చేసిన అప్పీళ్లపై జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ అమితవరాయ్‌లతో కూడిన బెంచ్‌ ఉదయం 1030 గంటలకు తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు.
 
అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తమ తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్‌ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలసి ఆయన సోమవారం రాత్రి ఆయన పన్నీర్‌ గూటికి చేరారు. దీంతో పన్నీర్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్‌ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్‌ ఎద్దేవా చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments