Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్ వల్లాభాయ్ పటేల్ లక్ష్యం.. ఐక్య భారత్ : నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:57 IST)
సర్దార్ వల్లాభాయ్ పటేల్ భారత దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేశారు. అంతేకాకుండా, పటేల్ కేవలం ఉక్కు సంకల్పం ఉన్న నేత మాత్రమే కాదని, భారతదేశ స్ఫూర్తి ప్రదాత అని మోడీ కొనియాడారు. శుక్రవారం ఉదయం పటేల్‌ జయంతి సందర్భంగా విజయ్‌చౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పటేల్‌ ఆధునిక భారత నిర్మాత అని అభివర్ణించారు. పటేల్‌ ప్రధాని అయి ఉంటే దేశం పరిస్థితి మరోలా ఉండేదన్నారు. దేశాన్ని ఏకీకృతం చేయడానికే పటేల్‌ తన జీవితాన్ని అంకింతం చేశారని చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై తెచ్చిన ఘనత పటేల్‌ది అని గుర్తు చేశారు. 
 
సైద్ధాంతిక విభేదాలను బట్టి దేశచరిత్రను మార్చలేమని మోడీ అన్నారు. చరిత్రను మరిచే ఏ జాతికి భవిష్యత్‌ ఉండదని వ్యాఖ్యానించారు. పటేల్‌ లేకుండా గాంధీ ఏం చేయలేకపోయేవారని చెప్పారు. సంస్థానాల విలీనం పటేల్‌ శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా కొనియాడారు. పటేల్‌ లక్ష్యం... ఐక్య భారత్‌ అని, దాని కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments