Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు హత్య : ఆరుగురికి మరణశిక్ష

తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్ల

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత వర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి దళిత యువకుడిని అత్యంత పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన నిందితుల్లో ఆరుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది మార్చి 13వ తేదీన ఉడుమల్‌పేట్ బస్‌స్టాండ్‌కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసి వస్తున్న శంకర్ దంపతులపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య కౌశల్య కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స కోలుకుంది. 
 
ఈ హత్య కేసుకు సంబంధించి వీడియో ఫూటేజీ ఆధారంగా మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తిరుపూరు జిల్లా సెషన్సు కోర్టులో జరిగింది. మొత్తం 1500 పేజీల చార్జిషీటును పరిశీలించిన న్యాయమూర్తి అలమేలు నటరాజన్ మంగళవారం తుది తీర్పును వెలువరించారు. 
 
మొత్తం 11 మందిలో ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవిత ఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయనున్నట్టు శంకర్ భార్య కౌసల్య వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments