Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు... కార్పొరేట్ ఆట : సంజయ్ రౌత్

ఠాగూర్
ఆదివారం, 2 జూన్ 2024 (14:05 IST)
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రికల ఎన్నికలో పోలింగ్ జూన్ ఒకటో తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఈ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను వెల్లడించిన సర్వేలన్నీ బీజేపీ కూటమికి అనుకూలంగా మెజార్టీ కట్టబెట్టాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై శివసేన సీనియర్ నేత, మాజీ మంత్రి సంజయ్ రౌత్ మరో స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓ కార్పొరేట్ ఆటగా అభివర్ణించారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉండటంతోనే ఫలితాలన్న ఒకే రకంగా ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ ఫలితాలను కార్పొరేట్ల ఆటగా అభివర్ణిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కూటమికి 295 నుంచి 310 స్థానాల వరకు వస్తాయని జోస్యం చెప్పారు. 
 
బారామతిలో ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే 1.5 లక్షల మెజార్టీతో గెలుస్తారని ఆయన చెప్పారు. గతంలో సాధించిన 18 సీట్లను తమ పార్టీ శివసేన నిలబెట్టుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ ఈసారి అద్భుత ప్రదర్శన కనపరుస్తుందని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి ఏకంగా 35, బీహార్‌లో ఆర్జేడీ 16 సీట్లను కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments