Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ లో కరోనా మృతుల కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (07:41 IST)
కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పార్కులు మూసేస్తున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కరోనాపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

వైరస్ బారినపడిన వారి చికిత్స ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి చికిత్స సహాయత కోశ్ పథకం నుంచి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు నితీశ్ కుమార్. ఒకవేళ చికిత్స పొందుతూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. 
 
బీహార్‌ను ఆనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దు వెంట 49 ప్రత్యేక క్యాంపులు పెట్టి స్క్రీనింగ్ చేస్తున్నామని, కరోనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు నితీశ్ కుమార్.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని, ఆస్పత్రుల్లో అదనంగా ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కరోనాపై చర్చ ముగిసిన తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments