Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు భార్యలుంటే జాక్‌పాట్.. యేడాదికి బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (08:41 IST)
ఇద్దరు భార్యలు ఉంటే జాక్ పాట్ తగిలినట్టేనని కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం మహాలక్ష్మి పథకం కింద గృహిణికి యేడాదికి రూ.లక్ష నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్నారు. అదే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే యేడాదికి రూ.2 లక్షలు జమ అవుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్ర మాజీ మంత్రి అయిన కాంతిలాల్ భూరియా గురువారం ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాత్లం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. పేద మహిళలకు ప్రతి యేటా ఈ పథకం కింద రూ.లక్ష నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. 
 
అదే ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తి అయితే, యేడాదికి ఖాతాలో రెండు లక్షలు జమ అవుతాయని అన్నారు. సైలానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పై విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ద్వారంపూడికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పవన్.. కాకినాడలో జనసేనాని రోడ్‌షోకు పర్మిషన్ నో!! 
 
కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. గత కొంతకాలంగా ద్వారంపూడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న పవన్... ద్వారంపూడిని మాఫియా డాన్‌గా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ రోడ్‌షో పాటు బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అయితే, ద్వారంపూడి తన అధికారాన్ని ఉపయోగించి పవన్ సభలకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్‌షో, సభకు టీడీపీ, జనసేనలు దరఖాస్తులు చేసుకున్నాయి. అయితే, అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ అనుమతి ఇవ్వలేదు. 
 
దీంతో పవన్ పర్యటన రూట్ మార్చి ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైకాపా అధికార దుర్వినియోగం, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. అనుమతుల కోసం అర్థరాత్రి 12 గంటల వరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు పడిగాపులు కాశారు. అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి కారణం... కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తే తాను చిత్తుగా ఓడిపోతానన్న భయం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలో బలంగా పాతుకుపోయింది. దీంతో తన అధికార బలంతో కాకినాడలో పవన్ పర్యటనకు రాకుండా అడ్డుకుంటున్నారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments