Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో రూ.1.88 కోట్ల నగదు-రూ.87.19 లక్షల లిక్కర్ స్వాధీనం

సెల్వి
సోమవారం, 25 మార్చి 2024 (14:06 IST)
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో రూ.1.88 కోట్ల నగదు, రూ.87.19 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో 28 నియోజకవర్గాలకు ఏప్రిల్ 26, మే 7న రెండు దశల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. 
 
చిత్రదుర్గ పార్లమెంటరీ నియోజకవర్గంలోని హిరియూరులో స్టాటిక్ సర్వైలెన్స్ బృందం రూ.1.44 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే నియోజకవర్గంలో చల్లకెరె వద్ద ఎక్సైజ్ శాఖ 14,688 లీటర్ల ఇండియా మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్)ను స్వాధీనం చేసుకుంది. 
 
ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసు అధికారులు రూ.17.66 కోట్ల నగదు, రూ.24.25 కోట్లకుపైగా విలువైన 7.69 లక్షల లీటర్ల మద్యం, 87.04 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇంకా రూ.75 లక్షలకు పైగా విలువైన వస్తువులు, రూ. 1.27కోట్ల విలువైన బంగారం, రూ. 21.47 లక్షల విలువైన వెండి, రూ. తొమ్మిది లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments