Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర సదన్‌లో రోటీ రచ్చ.. ఇరకాటంలో మోడీ సర్కారు!

Webdunia
గురువారం, 24 జులై 2014 (09:47 IST)
ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్‌లో తమకు సంప్రదాయ వంటలు వడ్డించలేదన్న నెపంతో 11 మంది శివసేన ఎంపీలు ఒక ముస్లిం వ్యక్తికి రోటీ తినిపించి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేసిన అంశం పార్లమెంటులో దుమారం రేపింది. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విపక్ష సభ్యులు విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ రోటీ వివాదం ఓ పెను వివాదంలా మారింది. పార్లమెంటు ఉభయ సభలను ఓ కుదుపు కుదిపింది. బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ సైతం రోటీ వివాదంపై విచారం వ్యక్తం చేశారు. అలా జరిగి వుండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇరకాటంలో పడినట్టయింది. 
 
దీంతో తేరుకున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు సభలో వివరణ ఇచ్చారు. రోటీ వ్యవహారాన్ని వివాదం చేయరాదని, ముఖ్యంగా... మత రంగు అంటించరాదని విపక్ష పార్టీలను కోరారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments