Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు: అత్తమ్మ సెంటిమెంట్-జయ మేనకోడలు దీప గుర్తు కోడిపుంజు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. రెండాకులు మూడాకులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ముప్పేట దాడి చేస

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (16:41 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. రెండాకులు మూడాకులుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లపై ముప్పేట దాడి చేసేందుకు శశికళ వర్గం, ఓపీఎస్ వర్గంతో పాటు దీప కూడా రెడీ అయిపోతోంది. దీప ఈ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుపోకుండా ఒంటరి పోరు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కోడిపుంజు గుర్తుతో ఆర్కే నగర్ ఎన్నికల్లో దీప బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 
 
జయలలిత మరణానికి తర్వాత ఖాళీగా ఉన్న ఆర్కే నగర్ స్థానంలో రెండాకులతో ఓపీఎస్ వర్గం ముందుకెళ్తుంటే.. శశికళ కూడా రెండాకుల చిహ్నంతో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దీప ఏ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే దీప కోడిపుంజు గుర్తు పట్ల ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎంజీఆర్ మరణానికి అనంతరం రెండాకుల చిహ్నం ఎవరికీ కేటాయించబడలేదు. దీంతో ఎంజీఆర్ సతీమణి జానకి రెండు పావురాల గుర్తుతో, జయలలిత కోడిపుంజు గుర్తుతో పోటీచేశారు. ఆ సెంటిమెంట్‌తోనే.. దీప కూడా కోడిపుంజు చిహ్నాన్ని ఎంచుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్నికల సంఘంతో దీప కోడిపుంజు గుర్తుకోసం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments