Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు.. ఎన్సీబీ ముందు ప్రత్యక్షమైన రియా చక్రవర్తి, షోవిక్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:17 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తరుణంలో రియాతో పాటు ఆయన సోదరుడు షోవిక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం ముందు ప్రత్యక్షం అయ్యారు.

రియా యొక్క బెయిల్ నిబంధనల ప్రకారం, ప్రతి నెల మొదటి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావలసి ఉంది. ఇలా ఆరు నెలల పాటు రియా హాజరు కావలసి ఉండగా, సోమవారం తన సోదరుడు, తండ్రి ఇంద్రజిత్‌తో కలిసి ఎన్సీబీ ఆఫీసుకు వెళ్ళింది. 
 
జైలు నుండి విడుదలైన తర్వాత పబ్లిక్‌లో పెద్దగా కనిపించేందుకు వీరు ఆసక్తి చూపించడం లేదు. కాగా, రియా బాంద్రాలో ఇల్లు కొనేందుకు అన్వేషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా సుశాంత్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ని కూడా ఎన్సీబీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం రియా, షోవిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. రియాకు వెంటనే బెయిల్ దొరకడంతో ఆమె విడుదల కాగా, షోవిక్ చక్రవర్తి బెయిల్ తిరస్కరణకు గురికావడంతో మూడు నెలలుగా జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments