Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: భద్రత వలయంలో హస్తినాపురి

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరం మొత్తాన్ని భద్రత

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (09:23 IST)
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరం మొత్తాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
దాదాపు 50 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు కాశ్మీరులో హై అలర్ట్‌ ప్రకటించారు. 18 ఏళ్ల కశ్మీరేతర యువతి గణతంత్ర వేడుకలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో గణంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.
 
పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇకపోతే.. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments