Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోద

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:42 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా రేణుకా చౌదరి వార్తల్లోకెక్కారు.
 
ఈసారి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు అమ్మారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు అమ్మి రూ.5లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రేణుకా చౌదరి మొక్కజొన్నలను అమ్మారు. 
 
రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు కొన్నాక.. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ.60వేలిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ.50 వేలు ఇచ్చారు. ఇలా పలువురు కాంగ్రెస్ నేతలు అందించిన నగదును రైతుల కుటుంబాలకు అందజేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments