Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రత్యేక హోదా... నిలదీసిన రేణుకా చౌదరి... చూస్తున్న తెదేపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేం

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ తన పట్టును వీడటంలేదు. తక్షణమే ఈ బిల్లుపై చర్చించి ఓటింగ్ చేపట్టాలంటూ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే రాజ్యసభ డిప్యూటి స్పీకర్ కురియిన్ బిల్లుపై చర్చించేందుకు తిరస్కరించారు. ఆగస్టు 3వ తేదీన చర్చ చేపట్టేందుకు సిద్ధమని చెప్పారు. డిప్యూటి స్పీకర్ నిర్ణయం పైన కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరితో సహా పలువురు ఎంపీలు పోడియంను చుట్టుముట్టి ప్రత్యేక హోదాపై చర్చించాల్సిందేనంటూ పట్టుబట్టారు.
 
ఈ దశలో తెలుగుదేశం ఎంపీలు అలా చూస్తూ ఉన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ... మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆ సంతాపాన్ని తెలియజేయడాన్ని చూస్తూనే ఉన్నామని చెపుతూ, ప్రత్యేక హోదా కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా బిల్లు చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో సభ గందరగోళంగా మారింది. దీనితో డిప్యూటీ స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments