Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగత్ సింగ్ నాటకం కోసం రిహార్సల్ : ఉరి బిగించుకుని బాలుడి మృతి

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భగత్ సింగ్ నాటకం కోసం రిహాల్స్ చేస్తుండగా జరిగిన అపశృతి కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భ‌గ‌త్ సింగ్ నాట‌కం ప్ర‌ద‌ర్శించేందుకు యూపీలోని బ‌దౌన్ జిల్లా బ‌బ‌త్ గ్రామంలో కొందరు విద్యార్థులంతా కలిసి రిహార్సల్ చేపట్టారు. భూరే సింగ్ కుమారుడైన శివ‌రామ్ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి రిహార్స‌ల్స్ చేస్తూ భ‌గ‌త్ సింగ్ ఉరితీత సీన్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు శివం త‌న మెడ‌చుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు.
 
తాను నిలుచున్న స్టూల్ ప‌డిపోవ‌డంతో ఉరిబిగుసుకుని బాలుడు మ‌ర‌ణించాడని స్ధానికులు తెలిపారు. దీంతో భ‌యానికి గురైన పిల్ల‌లు సాయం కోసం కేక‌లు వేయ‌గా అక్క‌డికి చేరుకున్న స్ధానికులు శివంను కింద‌కు దింపి ఉచ్చును తొల‌గించ‌గా బాలుడు అప్ప‌టికే మ‌ర‌ణించాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని జిల్లా ఎస్పీ సంక‌ల్స్ శ‌ర్మ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments