Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగత్ సింగ్ నాటకం కోసం రిహార్సల్ : ఉరి బిగించుకుని బాలుడి మృతి

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:45 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భగత్ సింగ్ నాటకం కోసం రిహాల్స్ చేస్తుండగా జరిగిన అపశృతి కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం భ‌గ‌త్ సింగ్ నాట‌కం ప్ర‌ద‌ర్శించేందుకు యూపీలోని బ‌దౌన్ జిల్లా బ‌బ‌త్ గ్రామంలో కొందరు విద్యార్థులంతా కలిసి రిహార్సల్ చేపట్టారు. భూరే సింగ్ కుమారుడైన శివ‌రామ్ ఇత‌ర పిల్ల‌ల‌తో క‌లిసి రిహార్స‌ల్స్ చేస్తూ భ‌గ‌త్ సింగ్ ఉరితీత సీన్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు శివం త‌న మెడ‌చుట్టూ ఉచ్చు బిగించుకున్నాడు.
 
తాను నిలుచున్న స్టూల్ ప‌డిపోవ‌డంతో ఉరిబిగుసుకుని బాలుడు మ‌ర‌ణించాడని స్ధానికులు తెలిపారు. దీంతో భ‌యానికి గురైన పిల్ల‌లు సాయం కోసం కేక‌లు వేయ‌గా అక్క‌డికి చేరుకున్న స్ధానికులు శివంను కింద‌కు దింపి ఉచ్చును తొల‌గించ‌గా బాలుడు అప్ప‌టికే మ‌ర‌ణించాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని జిల్లా ఎస్పీ సంక‌ల్స్ శ‌ర్మ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments