Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉర్జీత్ పటేల్ తలతిక్క పనులు... దొంగనోట్లు డిపాజిట్ అవుతున్నాయ్... బ్యాంకుల సమాఖ్య సంచలనం

నోట్ల రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తలతిక్క పనుల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ నిర్ణయం వల్ల దేశంలో 50 మంది ప్రజలతో పాటు 11 మంది బ్యాంకు సిబ్బంది మృత్యువాత

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (20:21 IST)
నోట్ల రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తలతిక్క పనుల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ నిర్ణయం వల్ల దేశంలో 50 మంది ప్రజలతో పాటు 11 మంది బ్యాంకు సిబ్బంది మృత్యువాత పడ్డారని ఆల్ ఇండియా బ్యాంకుల సమాఖ్య ఉపాధ్యక్షులు ఫ్రాంక్ ధ్వజమెత్తారు. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ఉర్జిత్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... దేశంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి ఉన్న సహకార బ్యాంకులను పక్కన పెట్టడం దారుణం అన్నారు. ఆర్బీఐ 2 వేల నోట్లకు బదులు రూ. 100 నోట్లు ముద్రించి ఉంటే బాగుండేదనీ, చెడిపోయిన రూ.100 నోట్లను మార్కెట్లోకి వదలుతూ బ్యాంకు సిబ్బంది ఆరోగ్యంతోనే కాక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. 
 
నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. ఈ ఒత్తిడి కారణంగా దొంగనోట్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ ప్రధాని, ఆర్థిక మంత్రిని తప్పుదారి పట్టించారనీ, నోట్లు రద్దు చేసిన దేశాల వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోకుండా రద్దును ప్రకటించి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. చేతిపై ఇంకు వేయడం వంటి తలతిక్క పనులతో ప్రజల్లో అయోమయం సృష్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments